Andhra Pradesh Telangana National Entertainment International Gossips Sports Devotional Jobs

వైకుంఠ ఏకాదశి రద్దు నిర్ణయం తప్పు -భూమన కరుణాకర్ రెడ్డి

Share Post
Bejjam Mamatha
journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

“10 రోజుల ద‌ర్శ‌నం కొనసాగించకపోతే హిందువుల భావాల‌కు ద్రోహం” – భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా 10 రోజులపాటు ద‌ర్శ‌నం కల్పించే నిర్ణయం 2020లో వైయస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్నామని, ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు రద్దు చేయడం హిందువుల మనోభావాలకు తీవ్ర అవమానం అని మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.


“వైయస్ జగన్, ఈవో అనిల్‌కుమార్ సింఘాలే ఆ నిర్ణయానికి కారణం”

భూమన కరుణాకర్ రెడ్డి వివరించారు –
“వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులకు ద‌ర్శనం కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి సీఎం వైయస్ జగన్, ప్రస్తుత ఈవో అనిల్‌కుమార్ సింఘాల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకున్నారు. పెద్ద జీయర్ సూచన మేరకు 32 మంది సభ్యుల ఆమోదంతో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కొనసాగించే నిర్ణయం తీసుకున్నాం. ఇది తిరుమలలో నాటి నుంచే ఉన్న సాంప్రదాయం.”


“డ్రావిడ సాంప్రదాయానికి, నారాయణ ప్రబంధానికి గౌరవం”

“తిరుమలలో డ్రావిడ సాంప్రదాయం, నారాయణ ప్రబంధం అంటే 12 మంది ఆయువారులు స్వామివారిని కీర్తించిన వారు. బ్రహ్మోత్సవాల సమయంలో పెద్ద జీయర్ మటం వారి ఆచారం ప్రకారం ఇది ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న పద్ధతి. ఆ సాంప్రదాయాన్ని వితండవాదంతో తారుమారుచేయడం సరికాదు,” అని ఆయన అన్నారు.

ఇటీవల ప్రమోషన్లు పొందిన ఐఏఎస్ అధికారులకు శుభాకాంక్షలు – Pawan Kalyan

“10 రోజుల దర్శనం రెండు రోజులకు తగ్గించడం తప్పు”

“ఆ రోజు పాలక మండలి తీసుకున్న మంచి నిర్ణయాన్ని అమలు చేయలేకపోయి ఇప్పుడు వితండవాదం చేయడం తగదు. గత సంవత్సరం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందడం పరిపాలనా వైఫల్యం.
భక్తుల భద్రత కోసం సక్రమ చర్యలు తీసుకోవాలి కానీ దర్శనాన్ని రద్దు చేయడం కాదు,” అని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.


“హిందువుల మనోభావాలను గాయపరిచే నిర్ణయం”

“10 రోజుల ద‌ర్శ‌నాన్ని రెండు రోజులకు పరిమితం చేయడం కోట్లాది హిందువుల మనోభావాలను కత్తుల‌తో పొడిచిన‌ట్లుగా ఉంటుంది. ఆగమ సలహా మండలి ఇచ్చిన నిర్ణయం ప్రకారం 10 రోజుల ద‌ర్శ‌నం కొనసాగించాల్సిందే,” అని ఆయన స్పష్టం చేశారు.


“టీటీడీ పాలక మండలి తప్పు మార్గంలో నడుస్తోంది”

భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర హెచ్చరికతో చెప్పారు –
“వైతాళిక ఆగమ సలహా మండలి నిర్ణయాన్ని పక్కన పెడితే టీటీడీ పాలక మండలిని ఎండగట్టక తప్పదు. ఆ రోజు మేం తీసుకున్న నిర్ణయం సక్రమమైనదే. దాన్ని తిరస్కరించడం సాంప్రదాయాలపై దాడి చేయడం లాంటిది,” అని అన్నారు.

గిరిజన మహిళలకు ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan నూతన సంవత్సర కానుక

Bejjam Mamatha
journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Leave a Comment

Dark Mode