ఐదునెలలుగా జీతాలు అందక ములుగు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుడు మహేష్ ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం.
ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. కార్మికులకు కనీసం నెలనెలా జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిని తెచ్చినందుకు ముఖ్యమంత్రి, మంత్రి క్షమాపణలు చెప్పాలి.
ములుగు నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణ ఘటనకు మంత్రి సీతక్కతోపాటు.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యులు..
ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, నెలల తరబడి పెండింగ్ పెడితే పేద కార్మికులు ఎలా బతకాలో ముఖ్యమంత్రి, మంత్రి సమాధానం చెప్పాలి.
మృతుని కుటుంబానికి వెంటనే 50 లక్షల రుపాయల ఎక్స్ గ్రేషియాతోపాటు.. అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. లేకపోతే బీఆర్ఎస్ పక్షాన బాధితుని కుటుంబంతోపాటు, జీతాలు అందని కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తాం అని కల్వకుంట్ల తారక రామారావు, brs working president
Arattai