Digi Rythu Bazar: రైతు బజార్ల నుంచి చవక ధరకే ఇంటికి సరుకులు.. ప్రభుత్వం నుంచి సరికొత్త యాప్.. రాష్ట్రవ్యాప్తంగా లాంచ్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిత్యావసరాల కొనుగోలులో కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది.
స్థానిక రైతు బజార్లలో లభించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇంటికే చవక ధరకే అందించేందుకు సరికొత్త డిజిటల్ వేదికను తీసుకొచ్చింది.
ప్రైవేట్ క్విక్ కామర్స్ యాప్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే ఈ సేవలను అందించడం విశేషంగా మారింది.
ప్రస్తుతం మార్కెట్లో స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ వంటి యాప్లు అందుబాటులో ఉన్నాయి.
వీటి ద్వారా సరుకులు త్వరగా అందుతున్నా, ధరలు ఎక్కువగా ఉండటం, అదనపు ఛార్జీలు వసూలు చేయడం వినియోగదారులపై భారం పెంచుతోంది.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొత్త విధానంతో ముందుకు వచ్చింది.
డిజీ రైతు బజార్
ప్రైవేట్ కంపెనీలకు సంబంధం లేకుండా
Andhra Pradesh Government
స్వయంగా డిజీ రైతు బజార్ పేరుతో వెబ్సైట్, యాప్ను ప్రారంభించింది.
దీని ద్వారా రైతు బజార్లలో ఉన్న అదే ధరలకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు ఇంటికే డోర్ డెలివరీ చేయనుంది.
డిజీ రైతు బజార్ యాప్ ద్వారా
మీరు ఆర్డర్ చేసిన సరుకులు స్థానిక రైతు బజార్ నుంచే నేరుగా మీ ఇంటికి చేరతాయి.
మధ్యవర్తులు లేకపోవడంతో రైతులకు న్యాయం, వినియోగదారులకు తక్కువ ధరలు లభించే అవకాశం ఉంటుంది.
ఈ యాప్లో ప్రత్యేకత ఏమిటంటే
రైతు బజార్లో ఉన్న ధరలే యాప్లో కూడా వర్తిస్తాయి.
అదనపు మార్కప్లు, హై డెలివరీ ఛార్జీలు ఉండవు.
దీంతో తాజా, నాణ్యమైన సరుకులు చవకగా అందుతాయి.
ప్రస్తుతం విశాఖపట్నంలోని కొన్ని రైతు బజార్ల ద్వారా
5 కిలోమీటర్ల పరిధిలో ఈ సేవలను అందిస్తున్నారు.
ఇది పైలట్ ప్రాజెక్ట్గా అమలులో ఉండగా, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
డిజీ రైతు బజార్లో
ఆన్లైన్ పేమెంట్తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి అన్ని చెల్లింపు మార్గాలను అందిస్తున్నారు.
ఈ యాప్ రైతులకు కూడా లాభదాయకంగా మారనుంది.
వారి ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేరడంతో
అమ్మకాలు పెరిగే అవకాశం ఉంటుంది.
అదే సమయంలో వినియోగదారులకు నమ్మకమైన ప్రభుత్వ సేవగా ఇది మారనుంది.
డిజీ రైతు బజార్ యాప్ ఎలా వాడాలి?
• https://digirythubazaarap.com వెబ్సైట్ లేదా యాప్లోకి వెళ్లాలి
• మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ నమోదు చేసి రిజిస్టర్ కావాలి
• మొబైల్ నెంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి
• లొకేషన్ పర్మిషన్ ఇస్తే సమీప రైతు బజార్లు కనిపిస్తాయి
• కావలసిన రైతు బజార్ను సెలక్ట్ చేసుకోవాలి
• అవసరమైన కూరగాయలు, పండ్లను కార్ట్లో యాడ్ చేయాలి
• అడ్రస్ వివరాలు ఎంటర్ చేయాలి
• పేమెంట్ ఆప్షన్ ఎంపిక చేసి ఆర్డర్ ప్లేస్ చేయాలి
• కొద్ది నిమిషాల్లోనే డోర్ డెలివరీ అందుతుంది
డిజీ రైతు బజార్ యాప్తో
ప్రభుత్వం నేరుగా వినియోగదారులకు సేవలు అందించడం
నిత్యావసరాల మార్కెట్లో కొత్త అధ్యాయంగా మారుతోంది.
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయన్న సమాచారం
వినియోగదారుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Pawan Kalyan: రేట్లు పెంచి అమ్మితే ఊరుకునేది లేదు.. వారికి పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్

Arattai