గత ప్రభుత్వం రూ.5500 కోట్ల ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి స్థానిక సంస్ధలను పూర్తిగా నిర్వీర్యం చేసింది.
దానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను ఎప్పటికప్పుడు స్థానిక సంస్థలకు జమచేసి గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుధ్యం, రోడ్ల నిర్మాణాలకు ఊతమిస్తోంది.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని సీఎం చంద్రబాబుగారు హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం నిన్న (సెప్టెంబర్ 2) స్థానిక సంస్థల ఖాతాల్లో రూ.1,120 కోట్లు జమ చేసారు. గత ఆగస్టులో స్థానిక సంస్థల బ్యాంకు ఖాతాలకు రూ.1452 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Arattai