సిద్దిపేటలో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు
సిద్దిపేట పట్టణంలో కురిసిన వర్షాలకు కోమటి చెరువు నాలా వరద ఉదృతికి గురైన ముంపు ప్రాంతాలు శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్, పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు .
క్షేత్ర స్థాయిలో పర్యటించి చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ..
– ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది
– తొగుట మండలంలో 20 సెంటీమీటర్ల వర్షం పడి ప్రజలు ఇబ్బంది పడ్డారు
– గత 20 సంవత్సరాలలో సిద్దిపేటలో ఇలాంటి వర్షం ఎప్పుడు పడలేదు
– భారీ వర్షం వల్ల సిద్దిపేటలో పలు కాలనీలు జలమయమయ్యాయి
– సిద్దిపేటలో వచ్చిన వరదను తగ్గించడానికి నర్సాపూర్ చెరువుకు ఒక మీటర్ తొలిగించాము..
– నర్సాపూర్ చెరువు నీటిని శనిగరం వాగు,మందపల్లి వాగు వైపు నీళ్లు మళ్లించాం…
– భవిష్యత్తులో వరద వచ్చినపుడు ఎలా చర్యలు చేపట్టాలో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు చేయాలని సూచించడం జరిగింది..
కరవు, కాటకాలతో అల్లాడుతున్న ఉమ్మడి పాలమూరు పేదరికాన్ని పరిశీలించడానికి విదేశాల నుంచి బృందాలు వచ్చే పరిస్థితి నుంచి జిల్లాను సమున్నత స్థానం| ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
– ప్రజలు కూడా సహకరించాలి.
– నాలాలు కబ్జాలు చేసి ఇల్లు నిర్మించుకున్నాక వరదలు వస్తే బాధపడితే ఎలా ?
– లోతట్టు ప్రాంతాలలో తక్కువ ధరకు వస్తున్నాయని ఇల్లు నిర్మాణం విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలి
– రానున్న రోజుల్లో ప్రజలు సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మించుకోకూడదు..
– లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
– మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పరవేక్షణ చేయాలి..
ప్రజలు ఆందోళన చెందోద్దు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు




Related News
- హైదరాబాద్లో కొత్త సినిమా థియేటర్లు.. సంక్రాంతి నాటికి ప్రారంభం, లిస్ట్ ఇదే
- ‘తెలంగాణకు ఆదర్శం చైనాలోని ఆ పట్టణమే’.. తొలి రోజే వేల కోట్ల పెట్టుబడులు
- దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్: ప్రపంచ ప్రముఖుల రాకతో హైదరాబాద్ కేంద్రంగా
Arattai