Telangana – శ్రీ కాళోజీ నారాయణ రావు సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన నెల్లుట్ల రమాదేవి
ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణ రావు గారి పేరిట ప్రతి ఏటా అందజేసే ప్రతిష్టాత్మకమైన సాహితీ పురస్కారం 2025 సంవత్సరానికి గాను ఎంపికైన కవయిత్రి, రచయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి కి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
❇️ ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకమైన ఈ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. ప్రజా కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ గారి అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ 2025 సంవత్సరానికి ప్రముఖ కవయిత్రి శ్రీమతి నెల్లుట్ల రమాదేవి గారిని ఎంపిక చేసింది.
❇️ కమిటీ ఎంపికను ఆమోదించిన ముఖ్యమంత్రి రమాదేవికి అభినందనలు తెలిపారు. సెప్టెంబర్ 9, 2025 రవీంద్రభారతిలో జరిగే కాళోజీ జయంతి వేడుకలలో ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.
Related News
- హైదరాబాద్లో కొత్త సినిమా థియేటర్లు.. సంక్రాంతి నాటికి ప్రారంభం, లిస్ట్ ఇదే
- ‘తెలంగాణకు ఆదర్శం చైనాలోని ఆ పట్టణమే’.. తొలి రోజే వేల కోట్ల పెట్టుబడులు
- దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్: ప్రపంచ ప్రముఖుల రాకతో హైదరాబాద్ కేంద్రంగా
Arattai