మొంథా తుఫాన్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్‌ – ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచనలు

Share Post
Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. యంత్రాంగం సిద్ధం కాగా, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది.

మొంథా తుఫాన్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్‌ – ప్రజలకు జాగ్రత్త సూచనలు

అమరావతి:
మొంథా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయి సన్నద్ధతలో ఉంది. తుఫాన్ ప్రభావం కారణంగా తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, గాలులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ప్రభుత్వం తెలిపిన ప్రకారం, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని రక్షణ, సహాయక యంత్రాంగాలను మొహరించారు. రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్, పంచాయతీ, వైద్య, గ్రామ, పట్టణ స్థాయి అధికారులను హైఅలర్ట్‌లో ఉంచారు.

గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం

అధికారులు ప్రజలకు సూచించారు —

  • సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి.
  • గాలి వేగం పెరిగినప్పుడు బయటకు రాకూడదు.
  • విద్యుత్ లైన్లు, చెట్ల కింద నిలవకూడదు.
  • ప్రభుత్వ సూచనలను కచ్చితంగా పాటించాలి.

అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ, కలెక్టర్ కార్యాలయాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.

ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తూ, “ఎటువంటి పుకార్లను నమ్మవద్దు. అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి” అని విజ్ఞప్తి చేసింది.

పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

Facebook | X | WhatsApp

Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Related News

Leave a Comment