అమరావతి, అక్టోబర్ 22: డోర్ స్టిక్కర్ విడుదల చేసిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా “ప్రతి ఇంటా స్వదేశీ – ఇంటింటా స్వదేశీ” కార్యక్రమాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా రూపొందించిన డోర్ స్టిక్కర్ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పీవీ ఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ పాల్గొన్నారు.
దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, స్వదేశీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. “ప్రతి కుటుంబం స్వదేశీ ఉత్పత్తులను వాడితే, దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది. ఇది నిజమైన ఆత్మనిర్భర్ భారత్ దిశలో మరో అడుగు,” అని ఆయన పేర్కొన్నారు.
జనసేన–బీజేపీ నాయకులు ఈ సందర్భంగా ప్రజలను స్వదేశీ ఉత్పత్తుల వినియోగంలో ముందుండాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారాన్ని విస్తృత స్థాయిలో కొనసాగించాలని నిర్ణయించారు.
Related News
- గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం
- పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
- మతాల మధ్య చిచ్చు పెట్టే శక్తులపై అప్రమత్తత అవసరం: శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని స్పష్టం చేసిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan
- జనవరి 9, 10, 11 తేదీల్లో నిర్వహించబడుతున్న పీఠికాపుర సంక్రాంతి
Arattai