తుపాను ప్రభావం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి

Share Post
Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

వైఎస్సార్‌సీపీ ర్యాలీ నవంబర్‌ 4కి వాయిదా

తాడేపల్లి, అక్టోబర్‌ 27:
మొంథా తుపాను ప్రభావం దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. అలాగే, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌సీపీ ర్యాలీ వాయిదా

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ అక్టోబర్‌ 28న (మంగళవారం) అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జరగాల్సిన వైఎస్సార్‌సీపీ ర్యాలీలను తుపాను కారణంగా నవంబర్‌ 4వ తేదీకి వాయిదా వేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ప్రకటించింది.

గిరిజనాభివృద్ధి, ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పన పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపిస్తోంది. రహదారి వసతి లేని గిరి శిఖర గ్రామాలకు అడవి తల్లి బాట పథకం ద్వారా రోడ్లు వేస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఉండాలన్నదే మా సంకల్పం

పార్టీ నేతలు ప్రజల భద్రతను ప్రాధాన్యంగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తుపాను సమయంలో ప్రభుత్వ యంత్రాంగం అందించే సూచనలను పాటిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు, సిబ్బందితో సమన్వయం సాధించాలని వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.


ముఖ్యాంశాలు:

  • 🌪️ మొంథా తుపాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైయస్‌ జగన్‌ సూచన
  • 🕓 అక్టోబర్‌ 28న జరగాల్సిన ర్యాలీలు నవంబర్‌ 4కి వాయిదా
  • 🤝 తుపాను బాధిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనాలని పిలుపు

పిఠాపురంలో రూల్స్ బుక్ మాత్రమే మాట్లాడాలి: ‘మోడల్ పిఠాపురం’ కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan

Facebook | X | WhatsApp

Bejjam Mamatha

journalist with three years of experience reporting for StarNews1.com, covering news across Andhra Pradesh and Telangana. I focus on politics, public issues, social stories, and breaking updates. With a commitment to accuracy and unbiased reporting, I aim to deliver clear, reliable, and engaging news that reflects the voice and concerns of Telugu readers.

Related News

Leave a Comment