బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు కెమికల్స్ సప్లై చేసిన అరిస్టో కెమికల్స్ సంస్థ
తిరుమల తిరుపతి దేవస్థానాల నెయ్యి సేకరణ వ్యవస్థలో జరిగిన అవకతవకలపై CBI పర్యవేక్షణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ SIT కీలక దర్యాప్తును పూర్తి చేసింది.
ఈ కేసుకు సంబంధించి సప్లిమెంటరీ చార్జ్షీట్ను SPE & ACB ప్రత్యేక న్యాయస్థానం, నెల్లూరు ముందు సమర్పించింది
దర్యాప్తులో, TTD ఆవు నెయ్యి సేకరణ ప్రక్రియలో నేరపూరిత కుట్ర, అవినీతి, చీటింగ్, నకిలీ డాక్యుమెంట్ల వినియోగం, అధికార దుర్వినియోగం జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు బయటపడ్డాయి.
ఈ కుట్రలో ప్రైవేట్ డైరీ కంపెనీలు, వాటి యజమానులు, డైరెక్టర్లు, మధ్యవర్తులు, అలాగే TTDలో పనిచేసిన మరియు పనిచేస్తున్న కొందరు అధికారులు సంయుక్తంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
నెయ్యి సరఫరా చేసిన కంపెనీల నకిలీ అనుభవ సర్టిఫికెట్లు, తప్పుడు FSSAI డాక్యుమెంట్లు, ఫేక్ బిల్లులు, లారీ రసీదులు, మొబైల్ ఫోరెన్సిక్ రిపోర్టులు, హ్యాండ్రైటింగ్ నిపుణుల అభిప్రాయాలు ఈ వ్యవహారం ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రనేనని నిర్ధారించింది.
విచారణలో వెల్లడైన ప్రకారం, భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ కు అరిస్టో కెమికల్స్ సంస్థ నుంచి నెయ్యి కల్తీ ప్రక్రియకు ఉపయోగపడే రసాయనాలు సరఫరా చేసినట్టు ఫోరెన్సిక్ మొబైల్ విశ్లేషణ ద్వారా నిర్ధారణ అయ్యింది
ఈ కేసులో IPC, BNS మరియు అవినీతి నిరోధక చట్టం కింద తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారు. కొంతమంది నిందితులు ఇప్పటికే న్యాయ కస్టడీలో ఉన్నారు. మిగతా నిందితులపై చట్టప్రకారం చర్యలు కొనసాగుతున్నాయి.
TTD వంటి కోట్లాదిమంది పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంలో అవినీతికి చోటు లేకుండా చేయాల్సింది ” జనసేన పార్టీ ఒక ప్రకటన లో తెలిపింది..
Arattai